Wednesday, January 12, 2011

సరైన దిశలో తెలంగాణా కాంగ్రెస్...

టి.ఆర్.ఎస్. మొదట నుండి తెలంగాణా కావాలని పట్టు పట్టింది.
బి.జే.పి. కూడా దానికి మద్దతు తెలిపింది.
తెలంగాణా లో ఎటువంటి బలము లేని పి.ఆర్.పి. సమైఖ్య ఆంధ్రా కి మద్దతు తెలిపింది.
కానీ ఈ విషయం పై కాంగ్రెస్, టి.డి.పి.లు మాత్రమే గోడ మీద పిల్లుల్లా వ్యవహరిస్తూ వచ్చాయి. టి.డి.పి. ప్రతిపక్షం లో ఉండటం వలన అది మద్దతు తెలిపినా తెలపక పోయినా వచ్చే తేడా పెద్దగా ఏమీ లేదు. తెలంగాణా ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని బీరాలు పలికిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం ధోరణి కొరుకుడు పడటంలేదు. మొదట శ్రీ కృష్ణ కమిటీ అనీ, తరువాత రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఒకదానికొకటి సంబంధం లేకుండా వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉంది. దీనితో ఇప్పటి వరకు అధిష్టానం పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు ఎదురు దాడికి దిగటం మొదలు పెట్టారు. జగన్ కి మద్దతు తెలుపుతున్న ఎం.ఎల్.ఏ. లను ఉదహరిస్తూ ఒక వ్యక్తి కోసం 24 మంది రాజీనామా చేయటానికి సిద్ధపడితే 4 కోట్ల మంది కోసం మేము రాజీనామా చేస్తే తప్పేంటి అని అధిష్టానాన్ని ప్రశ్నించారు. మీడియా ముందు డ్రామా చేయటానికి కాకుండా నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం పై ఇదే విధం ఒత్తిడి తెస్తేనే ఈ దీర్ఘ కాలిక సమస్యకు ఏదో ఒక పరిష్కారం, కనీసం పరిష్కారం దిశగా తొలి అడుగైనా పడుతుంది.

No comments:

Post a Comment