Thursday, November 25, 2010

భావి భారత ప్రధానికి? చుక్కెదురు...

బీహార్ ప్రజలు మరలా నితీష్ కుమార్ కి పట్టం కట్టి అభివృద్ధి కన్నా కులం ముఖ్యం కాదని తేల్చి చెప్పారు. లాలూ భార్యని పోటీ చేసిన రెండు చోట్లా ఓడించి దిమ్మ తిరిగేలా చేశారు. భావి భారత ప్రధానిగా ప్రచారమవుతున్న రాహుల్ గాంధీ "మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి" అంటూ ప్రచారం చేసినా ఏ మాత్రం ఉపయోగం లేక పోయింది. రాజశేఖరరెడ్డి కష్ఠపడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ని గెలిపిస్తే సోనియా గాంధీ ఫోటో పెట్టుకొని గెలిచాడని ప్రచారం చేస్తున్న వాళ్ళు బీహార్ లో సోనియా గాంధీ ఫోటోలకు ఏమి కరువు వచ్చిందో చెప్పాలి. ఏమంటారు?
వేణు బాబు పూరేటి
 

No comments:

Post a Comment