Saturday, November 27, 2010

26 /11 ... ఆత్మ క్షోభ

26 /11 అప్పుడే ఆ దుర్ఘటనకు 2 సంవత్సరాలు నిండిపోయాయి. నిన్న చిదంబరంగారు అమరవీరులకు అంజలి ఘటిస్తూ పాకిస్తాన్ కి చిత్తసుద్ధి లేదని, ఈ దుర్ఘటనకి బాధ్యులైన వారిని శిక్షిస్తామనిచెప్పి ఇంత వరకు విచారణ కూడా జరపటం లేదని మొసలి కన్నీరు కార్చారు. పాకిస్తాన్ సంగతి వదిలివేయండి. మనం ఒకరిని బందీగా పట్టుకున్నాం కదా.విచారణ కూడా పూర్తై శిక్ష కూడా ఖరారైంది కదా.మరి ఆ శిక్ష ఎప్పటికి అమలు అవుతుందో, దానిని ఆలస్యం చేయటం వెనుక మర్మమేమిటో చెప్పాలి. ఈ సంఘటనకి బాధ్యులైన వారిని శిక్షిన్చేవరకు, ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునే వరకు మీరు ఎన్ని అంజలిలు ఘటించిన ఆ అమరవీరుల ఆత్మ మరింత క్షోభిస్తుందే తప్ప ఇసుమంతైన శాంతిన్చదు. మీ కల్లబొల్లి మాటలు నమ్మి మాయబోయే వాళ్ళు ఎవరూ లేరు అని తెలుసుకోండి. ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవటం లో ఎంటువంటి అవకతవకలు జరిగినా ఆ అమరవీరుల కుటుంబాల ఉసురు మీకు తప్పకుండ తగులుతుంది.

No comments:

Post a Comment